బిగ్బాస్ ఈవెంట్ పుణ్యమా అని జూనియర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇన్నాళ్లు నటుడిగా సత్తా చాటిన తారక్ స్టార్ మా టీవీలో ప్రసారమైన బిగ్బాస్ షోతో ఎక్కడికో వెళ్లిపోయాడు. ప్రతి శని, ఆదివారాలు తారక్ కోసం తెలుగు ప్రేక్షకులు టీవీల ముందు వాలిపోయేవారు. కేవలం వారాంతాలో్ల తారక్ వస్తున్నాడనే టీఆర్పీలు కూడా ఎక్కువగా ఉండేవి. సినిమాలు, యాడ్లు కాకుండా తారక్ తొలిసారిగా హోస్ట్గా వ్యవహరించిన ప్రోగ్రాం అది. తొలి ప్రయత్నంలోనే సామాన్య ప్రేక్షకుడికి సైతం ఎన్టీఆర్ బాగా దగ్గరైపోయారు. తన మాటలతో ఆకట్టుకున్నారు. తాను ఉన్నంతసేపు తెలుగు ప్రేక్షకులను ఛానెల్ మార్చనీయకుండా అద్భుతంగా చేశారు. ఈ ప్రోగ్రాం ఎన్టీఆర్కు మరో అరుదన అవకాశాన్ని తీసుకొచ్చింది. ఈసారి స్పెషల్ ఏమిటంటే స్టార్ గ్రూఫ్ ఐపీఎల్ మ్యాచ్ లకు తెలుగు కామెంటరీ ప్లాన్ చేస్తోంది. తెలుగులో ఐపీఎల్ ప్రసారాలకు ఎన్టీఆర్ను బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుంది. ఈ ఒప్పందం ద్వారా స్టార్ టీవీ, ఎన్టీఆర్ల బంధం మరింత బలపడనుంది.
తాజా వార్తలు
Tuesday, 27 March 2018
నిన్న మొన్నటి దాకా హోదా అంటే జైలే అన్న పెద్ద మనిషి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గొంతు సవరించక తప్పలేదు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైయస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్సీపీని నిలువరించేందుకు చంద్రబాబు పిల్లి మొగ్గలేస్తున్నాడు. పక్కా అవకాశవాద రాజకీయ నాయకుడిగా మారిపోయి తన ఆత్మాభిమానాన్ని కూడా చంపుకుని రోజుకో మాటతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాడు. ఇప్పుడు సరికొత్తగా అఖిలపక్షం పేరుతో కొత్త డ్రామాకు తెరదీశాడు. అన్ని రాజకీయ పక్షాలను పిలిపించి నిర్ణయం తీసుకునే పేరుతో మరో కుట్రకు చంద్రబాబు బీజం పోసే పనిలోపడ్డాడు. ప్రత్యేక హోదా రాకపోవడంలో చంద్రబాబు ఉదాసీనత, అవకాశవాద రాజకీయాలే కారణమని రాజకీయవర్గాలతోపాటు ప్రజలందరికీ తెలిసిన విషయమే. తనపై ఉన్న అపవాదును తొలగించుకోవడానికి, తనకంటుకున్న బురదను వైయస్ఆర్సీపీకి పులిమేందుకు పూనుకున్నాడు. ప్రత్యేక హోదా పేరుతో అఖిలపక్షం ఏర్పాటు చేసి తీర్మాణం చేసి కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని బయటకు చెబుతున్నా.. లోతుగా ఆలోచిస్తే టీడీపీ ఇమేజ్ను పెంచుకోవడంతోపాటు.. వైయస్ఆర్సీపీని ప్రజల్లో చులకన చేసి చూపాలనే ఆలోచన స్పష్టంగా తెలుస్తుంది. టీడీపీ ఏర్పాటు చేసిన అఖిల పక్షానికి వైయస్ఆర్సీపీ ఎలాగూ దూరంగా ఉంటుంది. ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలోనూ రెండు సార్లు అసెంబ్లీలో తీర్మాణం చేసినా.. చంద్రబాబు మాత్రం ఏకపక్షంగా ఎవరి అభిప్రాయం తీసుకోకుండానే ప్యాకేజీకి అంగీకారం తెలిపాడు. పైగా ప్రత్యేక హోదా విషయంలోనూ గత నెలరోజుల్లో చంద్రబాబు పలుమార్లు మాటలు మార్చాడు. వైయస్ఆర్సీపీ అవిశ్వాసానికి మద్ధతిస్తామని ఒకసారి, తూచ్ సొంతంగా మేమే అవిశ్వాసం పెడతామని ఒకసారి.. మంత్రి పదవులకు రాజీనామా చేసినా.. ఎన్డీఏలోనే ఉంటామని ఇంకోసారి.. పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేశాడు. క్లైమాక్స్ వరకు వచ్చిన ప్రత్యేక హోదా అంశాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం పణంగా పెట్టాడు. ఇలాంటి స్థితిలో టీడీపీ నిర్వహించబోయే అవిశ్వాసానికి వైయస్ఆర్సీపీ ఎలాగూ రాదని వారికీ తెలుసు. చంద్రబాబుకు కూడా ఇదే కావాలి. ఇదే అదనుగా భావించి అనుకూల మీడియాల్లో
జగన్ పార్టీ మీద ఊకదంపుడు అసత్య ప్రచారం చేయొచ్చనేది వారి ఆలోచన. టీడీపీ అఖిల పక్షానికి పిలిచినా వారికి చిత్తశుద్ధిలేదని ప్రచారం చేయడం ద్వారా వైయస్ఆర్సీపీని కార్నర్ చేసి టీడీపీని ఛాంపియన్లుగా నిలబెట్టడమే ఎల్లో మీడియా ప్లాన్. అఖిలపక్ష భేటీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు డైరెక్షన్లో వైయస్ఆర్సీపీ మీద బురద చల్లడానికి ఎల్లో మీడియా పథక రచన చేసింది. చంద్రబాబు అనుకూల మీడియా మొత్తం మూకుమ్మడిగా కార్నర్ చేయాలనే ఉద్దేశ్యంతో తప్ప తెగించి పోరాడాల్సిన సమయంలో అఖిలపక్షంతో జరిగే ప్రయోజనం ఏమీ ఉండదని అందరికీ తెలిసిందే.
జగన్ పార్టీ మీద ఊకదంపుడు అసత్య ప్రచారం చేయొచ్చనేది వారి ఆలోచన. టీడీపీ అఖిల పక్షానికి పిలిచినా వారికి చిత్తశుద్ధిలేదని ప్రచారం చేయడం ద్వారా వైయస్ఆర్సీపీని కార్నర్ చేసి టీడీపీని ఛాంపియన్లుగా నిలబెట్టడమే ఎల్లో మీడియా ప్లాన్. అఖిలపక్ష భేటీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు డైరెక్షన్లో వైయస్ఆర్సీపీ మీద బురద చల్లడానికి ఎల్లో మీడియా పథక రచన చేసింది. చంద్రబాబు అనుకూల మీడియా మొత్తం మూకుమ్మడిగా కార్నర్ చేయాలనే ఉద్దేశ్యంతో తప్ప తెగించి పోరాడాల్సిన సమయంలో అఖిలపక్షంతో జరిగే ప్రయోజనం ఏమీ ఉండదని అందరికీ తెలిసిందే.
Thursday, 22 March 2018
బీజేపీ-టీడీపీలు తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అన్నారు. ఇప్పటికీ ఆ రెండు పార్టీలు ఒక అవగాహనతో ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క, ప్రత్యేక హోదా డిమాండ్తో గురువారం ఆంధ్రప్రదేశ్ అంతటా రహదారుల దిగ్బంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంటు భవన్ వద్ద విలేకరులతో వైఎస్ఆర్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి, అవినాష్ రెడ్డి మాట్లాడారు.
'విభజన హామీలు నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ పోరాటం చేస్తుంటే బీజేపీ, వైఎస్ఆర్సీపీ కుమ్మక్కయ్యాయంటూ టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు యూటర్న్ తీసుకున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి చంద్రబాబు కృష్టి చేయాలి. నాలుగేళ్లుగా బీజేపీతో కాపురం చేసి టీడీపీ చేసిందేమీ లేదు. కేంద్రం దిగి రాకుంటే ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తాం. అవిశ్వాసంపై సహకరించాలని పలు పార్టీలను కోరుతున్నాం. చంద్రబాబు తీరువల్లే విభజన హామీలు నెరవేరట్లేదు.
ప్రజల ఒత్తిడి మేరకే చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. లాలుచీ రాజకీయాలు టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య. విభజన హామీల కోసం నాలుగేళ్లుగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోంది. ఆ విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాకు విలన్ చంద్రబాబే. వైఎస్ఆర్సీపీ అవిశ్వాస తీర్మానానికి క్రెడిట్ వస్తుందని చంద్రబాబు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నారు. ప్రతి రోజు పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయడం కేంద్ర ప్రభుత్వానికి సమంజసం కాదు. అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ చర్చ జరిపించాల్సిందే' అని ఎంపీలు డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మాన నోటిసులు ఇస్తున్నా సభ సజావుగా లేదంటూ స్పీకర్ సభను వాయిదా వేస్తున్న విషయం తెలిసిందే.
Wednesday, 25 October 2017
చక్కెర వల్ల డయబెటీస్ వస్తుందనే విషయం మనకు తెలిసిందే. అయితే, మధుమేహం లేకున్నా, క్యాన్సర్ ముప్పు ఉన్నవారికి కూడా చక్కెర డేంజరేనని పరిశోధనలు తెలుపుతున్నాయి. ‘నేచర్ కమ్యునికేషన్’లో ప్రచురించిన కథనం ప్రకారం.. చక్కెరలో క్యాన్సర్ కణాలను ఉత్తేజపరిచే ‘RAS’ అనే జీన్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. డచ్ యూనివర్శిటీతో గత 9 ఏళ్లుగా జరుపుతున్న పరిశోధనలో చక్కెర.. క్యాన్సర్ కణాలను పోషించేందుకు ఉపయోగపడుతుందని తేలింది. ఈ నేపథ్యంలో శరీరంలో దాగివుండే క్యాన్సర్ కణాలను ఉత్తేజపరిచి, త్వరగా విస్తరించేందుకు చక్కెర ఉపయోగపడుతుంది. కేయూ ల్యూవెన్కు చెందిన మాలిక్యులర్ బయోలజిస్ట్ ప్రొఫోసర్ జాన్ థెవెలైన్ మాట్లాడుతూ.. ‘‘చక్కర అతిగా తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ పెంపొందించేందుకు దోహదం చేస్తోందని మా పరిశోధనల్లో తేలింది. ఇది ‘వార్బర్గ్’ బోలోపేతం కావడం వల్ల కాన్సర్ గెడ్డలు ఉత్తేజితం అవుతాయి’’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో చక్కెర, ఉప్పులను మితంగా తీసుకోవడమే ఉత్తమం. వీటిలో ఏది ఎక్కువైనా ఆరోగ్యానికి ముప్పే. ముఖ్యంగా వంశపారంపర్యంగా క్యాన్సర్, మధుమేహం రోగాల ముప్పు ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఇంటర్నేషనల్ బుల్లెట్ రైడర్ సనా ఇక్బాల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్ లోని నార్సింగి శివారులో జరిగిన కారు యాక్సిడెంట్లో సనా చనిపోయింది. అయితే సనా మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తే సనాను హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సనా ఇక్బాల్ 2015లో ఒంటరిగా 38 వేల కిలోమీటర్ల క్రాస్ కంట్రీ రైడ్ను పూర్తిచేసింది. దేశవ్యాప్తంగా వంద నగరాలను కవర్ చేస్తూ ఆమె ఈ రైడ్ను పూర్తిచేసింది. వెళ్లిన ప్రతీచోటా సెమినార్లు నిర్వహిస్తూ కుంగుబాటు, ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి యువతకు అవగాహన కల్పించింది.
ఎపి ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పేది నిజమే అయితే శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తప్పు చేస్తున్నారని అనుకోవాలి. తాను పార్టీ మారిన నేపద్యంలో అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆదినారాయణరెడ్డి అన్నారని వార్త వచ్చింది.తన రాజీనామాను స్పీకర్ పెండింగ్లో పెట్టారని చెప్పారు. స్పీకర్ ఆమోదించకుంటే తామేమి చేయగలమని అన్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన రాజీనామాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేయటం తనకు సమస్యేనని ఒప్పుకున్న ఆది.. ఎన్నికలు అనవసరమని భావించటం వల్లే తన రాజీనామాను స్పీకర్ ఆమోదించటం లేదమోనన్నాయన.. నా రాజీనామాను ఆమోదించమని స్పీకర్ ను ఒత్తిడి చేయలేమని చెప్పలేం కదా? అంటూ తన మాటలతో స్పీకర్ కోడెలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేశారు మంత్రి ఆది. మరి.. మంత్రివర్యుల మాటలకు స్పీకర్ గారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Subscribe to:
Posts
(
Atom
)
Social Buttons