Writen by
vaartha visheshalu
08:16
-
0
Comments
బంగ్లాదేశ్ నుండి భారత్ కు తరలిస్తున్న 10 కిలోల కొకైన్ ను పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర పరగణాల జిల్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో బంగ్లాదేశ్ నుండి వచ్చిన ఓ ట్రక్కులో పౌడర్ ను గుర్తించిన బీఎస్ఎఫ్ అధికారులు దానిని స్వాధీనం చేసుకొని, టెస్టింగ్ కోసం నార్కోటిక్ లాబొరేటరీకి పంపించారు. నార్కోటిక్ ఫలితాలలో ఆ పౌడర్ నిషిద్ద కోకైన్ గా తేలిందనీ, దాని విలువ సుమారు 40 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
No comments
Post a Comment