Writen by
vaartha visheshalu
01:09
-
0
Comments
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ మకావు బ్యాడ్మింటన్ ఓపెన్ విజేతగా నిలిచి మూడోసారి హాట్రిక్ నమోదు చేసుకుంది. జపాన్ షట్లర్ మినట్సు మితానీపై 21-9, 21-23, 21-14 తేడాతో సింధూ గెలిచింది. వరుసగా మూడో సారి టైటిల్ను సాధించిన పీవీ సింధూ. 2013, 2014లోనూ మకావు బ్యాడ్మింటన్ ఓపెన్ విజేతగా సింధూ నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధూ 21-8, 15-21, 21-16 తేడాతో జపాన్ షట్లర్ అకానె యామగుచిపై విజయం సాధించిన విషయం విదితమే.
No comments
Post a Comment